కోడిపందేలకు బ్రేక్
ABN , First Publish Date - 2022-01-12T15:02:49+05:30 IST
సంక్రాంతి సందర్భంగా కోడి పందేల కోసం సై కొడుతున్న పందెపురాయుళ్లకు మద్రాస్ హైకోర్టు బ్రేకులు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందేలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 25వ
- 25 వరకు ఇదే విధానం
- మద్రాస్ హైకోర్టు
ప్యారీస్(చెన్నై): సంక్రాంతి సందర్భంగా కోడి పందేల కోసం సై కొడుతున్న పందెపురాయుళ్లకు మద్రాస్ హైకోర్టు బ్రేకులు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందేలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఉత్తర్వులు ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు మదురై ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరూర్ జిల్లా అరవకుర్చి సమీపంలో కోడి పందేలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించడాన్ని సవాల్ చేస్తూ మదురై బెంచ్లో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 25వ తేదీ వరకు ఎక్కడా కోడి పందేలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. తేని జిల్లా ఉత్తమపాళయంలో నిబంధనలతో కూడిన కోడి పందేలకు ఇటీవల సింగిల్ జడ్జి అనుమతించారు. ఇప్పుడు ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలతో అక్కడి పందేలు కూడా నిలిచిపోయినట్లయింది.