ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేక సదుపాయాలు
ABN , First Publish Date - 2022-04-15T15:30:18+05:30 IST
రాష్ట్ర ప్రజారోగ్య సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజీవ్గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీహెచ్) సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.364.22 కోట్లతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్
చెన్నై: రాష్ట్ర ప్రజారోగ్య సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజీవ్గాంధీ స్మారక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీహెచ్) సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ.364.22 కోట్లతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ సదుపాయం, వైద్యపరికరాలతో కూడిన పడకలను, 516 పడకలతో కూడిన ప్రత్యేక చికిత్సా విభాగాలను ముఖ్యమంత్రి స్టాలిన్ గురువారం ఉదయం ప్రారంభించారు. రూ.65 కోట్లతో నెలకొల్పిన అంతర్జాతీయ స్థాయి యోగా కేంద్రం, ప్రకృతిసిద్ధమైన వైద్య పరిశోధనా సంస్థను కూడా ఆయన ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఏవీ వేలు, ఎం. సుబ్రమణ్యం, పీకే శేఖర్బాబు, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మేయర్ ప్రియారాజన్, డిప్యూటీ మేయర్ ఎం. మహేష్ కుమార్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జే రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.