Chief Minister: హోస్టన్‌ విశ్వవిద్యాలయంలో రూ 2.50 కోట్లతో తమిళపీఠం

ABN , First Publish Date - 2022-11-16T10:23:01+05:30 IST

అమెరికాలోనూ ప్రాచీన హోస్టన్‌ విశ్వవిద్యాలయంలో రూ.2.50 కోట్లతో తమిళపీఠం నెలకొల్పనున్నారు. ఆ మేరకు సచివాలయంలో మంగళవారం జరిగిన ప్రత్యేక

Chief Minister: హోస్టన్‌ విశ్వవిద్యాలయంలో రూ 2.50 కోట్లతో తమిళపీఠం

చెన్నై, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోనూ ప్రాచీన హోస్టన్‌ విశ్వవిద్యాలయంలో రూ.2.50 కోట్లతో తమిళపీఠం నెలకొల్పనున్నారు. ఆ మేరకు సచివాలయంలో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) తమిళపీఠం ఏర్పాటుకుగాను రూ.3లక్షల అమెరికన్‌ డాలర్ల విలువకు సరిపడా చెక్కును తమిళపీఠం అధ్యక్షుడు చొక్కలింగం శ్యామ్‌ కన్నప్పన్‌, కార్యదర్శి పెరుమాళ్‌ అన్నామలైకి అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడుతూ విదేశాల్లో తమిళ భాషను విస్తరింపజేయాలనే ఆశయంతో అక్కడి విశ్వవిద్యాలయాల్లో తమిళ పీఠాలను ఏర్పాటు చేసి తమిళభాషపై పరిశోధనలు, రచనలు చేసేవారికి తగిన ప్రోత్సాహాకాలు అందజేస్తున్నామని తెలిపారు. ఆ మేరకు అమెరికాలోని హోస్టన్‌ నగరంలో తమిళ భాషాభివృద్ధికి పాటుపడుతున్న అత్యంత ప్రాచీనమైన హోస్టన్‌ విశ్వవిద్యాలయంలో తమిళ పీఠం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

Updated Date - 2022-11-16T10:23:03+05:30 IST