మెరుగైన వైద్యం అందించాలి: కేంద్ర మంత్రి
ABN , First Publish Date - 2022-06-04T17:04:17+05:30 IST
బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని కేంద్ర రసాయన, ఎరువులు, ఇంధన శాఖ
బళ్లారి(బెంగళూరు), జూన్ 3 (ఆంధ్రజ్యోతి): బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని కేంద్ర రసాయన, ఎరువులు, ఇంధన శాఖ మంత్రి భగవంత్ ఖూబా వైద్యులకు సూచించారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర మంత్రి పరిశీలించి అనంతరం కలుబురగిలోని యునైటెడ్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఇలాంటి సంఘటన జరగడం దురదుష్టకరం అన్నారు. మృతులకు ఆర్థిక సహయం అందించేందుకు కర్ణాటక, తెలంగాణా రాష్ట్రల ముఖ్యమంత్రులతో మాట్లాడుతామన్నారు. అలాగే కేంద్రం నుంచి కూడా సహయం చేస్తామని పేర్కొన్నారు. గాయపడిన వారు ఎవరూ మనోధైర్యం కోల్పొవద్దండని మీ వెంట మేము ఉన్నామని ధైర్యం చెప్పారు. మంత్రి వెంట ఎస్పీ, జిల్లా కలెక్టర్, ఇతర ఎమ్మెల్యేలు ఉన్నారు.