ఆర్జేడీ అధినేత Lalu Prasad, అతని కుమార్తె ఇళ్లపై సీబీఐ దాడులు

ABN , First Publish Date - 2022-05-20T13:56:02+05:30 IST

రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్, ఆయన కుమార్తె ఇళ్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం దాడులు చేసింది....

ఆర్జేడీ అధినేత Lalu Prasad, అతని కుమార్తె ఇళ్లపై సీబీఐ దాడులు

పాట్నా(బీహార్): రాష్ట్రీయ జనతాదళ్ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్, ఆయన కుమార్తె ఇళ్లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం దాడులు చేసింది. అవినీతి, అక్రమాలపై లాలూప్రసాద్ యాదవ్ తో పాటు ఆయన కుమార్తెలపై సీబీఐ కొత్త కేసు నమోదు చేసింది.లాలూ, అతని కుమార్తెల అవినీతి కేసులో ప్రాథమిక విచారణలో తేలడంతో సీబీఐ కొత్తగా మరో కేసు నమోదు చేసింది.లాలూ ప్రసాద్ యాదవ్‌కు సంబంధించి సీబీఐ శుక్రవారం 15 చోట్ల సోదాలు నిర్వహించింది.దాణా కుంభకోణం కేసులో బెయిల్‌ పొందిన కొన్ని వారాల తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై తాజా అవినీతి కేసులో అభియోగాలు నమోదయ్యాయి.


139 కోట్ల దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.దీంతో 73 ఏళ్ల లాలూ గత నెలలో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఫిబ్రవరిలో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. రూ.60 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది.


Updated Date - 2022-05-20T13:56:02+05:30 IST