పంజాబ్ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
ABN , First Publish Date - 2022-01-27T23:13:08+05:30 IST
పంజాబ్ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 27 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం 27 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసినట్లు బీజేపీ పేర్కొంది. ఈ జాబితాలో కేంద్ర మాజీ మంత్రి విజయ్ సంప్లా కూడా ఉన్నారు. ఫగ్వారా నుంచి ఆయన పోటీ చేయనున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ సింగ్ లాల్పురా రూప్నగర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఎమ్మెల్యేలు ఫతే సింగ్ బజ్వా, కాంగ్రెస్ను విడిచిపెట్టి బీజేపీలో చేరిన హర్జోత్ కమల్ బటాలా మరియు మోగా నుంచి బరిలోకి దిగారు.