బీహార్లో కొనసాగుతున్న ‘అగ్నిపథ్’ ఆందోళనలు.. రైలు సర్వీసుల నిలిపివేత
ABN , First Publish Date - 2022-06-18T23:05:55+05:30 IST
‘అగ్నిపథ్’ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో బీహార్లో నేటి (శనివారం) రాత్రి 8 గంటల వరకు రైలు సర్వీసులు నిలిపివేశారు. ఆ..
పాట్నా: ‘అగ్నిపథ్’ ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో బీహార్లో నేటి (శనివారం) రాత్రి 8 గంటల వరకు రైలు సర్వీసులు నిలిపివేశారు. ఆ తర్వాత రైల్వే అధికారులు మరో ప్రకటన చేస్తూ రేపు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి 8 వరకు కూడా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అగ్నిపథ్ మిలటరీ రిక్రూట్మెంట్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మక రూపు దాలుస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ చేపట్టిన బంద్ సందర్భంగా రాష్ట్రంలో మరోమారు హింసాత్మక ఘటనలు జరిగాయి. బంద్ నిర్వహిస్తున్న నిరసనకారులు ఓ రైల్వే స్టేషన్, ఓ పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. నిరసనకారుల రాళ్ల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. కేంద్ర ప్రకటించిన ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ, బీహర్, యూపీ, హర్యానా సహా పలు రాష్ట్రల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.