బెంగళూరులోనే అత్యధిక Covid కేసులు
ABN , First Publish Date - 2022-02-16T17:39:21+05:30 IST
రాష్ట్ర రాజధాని బెంగళూరులోనే కొవిడ్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. మంగళవారం విడుదలైన బులెటిన్ ప్రకారం 1,405 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులోనే 765 మంది ఉన్నారు. ఆరు జిల్లాల్లో పదిమందిలోపు
బెంగళూరు: రాష్ట్ర రాజధాని బెంగళూరులోనే కొవిడ్ పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. మంగళవారం విడుదలైన బులెటిన్ ప్రకారం 1,405 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులోనే 765 మంది ఉన్నారు. ఆరు జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదు కాగా 23జిల్లాల్లో వందలోపు బాధితులు ఉన్నారు. 5,762 మంది కోలుకోగా 26 మంది మృతిచెందారు. బెంగళూరులో ఆరుగురు, దక్షిణకన్నడలో నలుగురు, బళ్లారిలో ముగ్గురు, మూడు జిల్లాల్లో ఇద్దరుచొప్పున, ఏడు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 26,832 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 11,101మంది ఉన్నారు.