Bbmpలో 50 శాతం రిజర్వేషన్లు
ABN , First Publish Date - 2022-06-12T16:51:53+05:30 IST
బృహత్ బెంగళూరు మహానగర పాలికెలో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్కు గవర్నర్ థావర్ చంద్గెహ్లాట్

- ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం
బెంగళూరు, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): బృహత్ బెంగళూరు మహానగర పాలికెలో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్కు గవర్నర్ థావర్ చంద్గెహ్లాట్ ఆమోదం తెలిపారు. 50 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 2020లో బీబీఎంపీ సవరణల చట్టంలో 33 శాతంగా మార్పు చేసింది. జరిగిన తప్పిదంపై పాలికె కమిషనర్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా నివేదికను పంపి మార్పును కోరారు. దీంతో ప్రభుత్వం 2020 బీబీఎంపీ సవరణల చట్టంలోని 33 శాతానికి కుదించిన రాజకీయ రిజర్వేషన్ పరిమితిని 50 శాతానికి మార్పు చేశారు. ఇందుకు సంబంధించి ఆర్డినెన్స్ను ప్రభుత్వం జారీ చేసింది. ఇవే ఉత్తర్వులను రాజభవన్కు పంపగా గవర్నర్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే బీబీఎంపీ ఎన్నికల్లో 50 శాతం మేర రిజర్వేషన్ ప్రకారమే అమలు చేస్తారు.