డ్రోన్ ఫెస్టివల్‌లో Asteria Aerospace డ్రోన్‌ను ఎగరేసిన మోదీ

ABN , First Publish Date - 2022-05-27T23:34:02+05:30 IST

బెంగళూరుకు చెందిన ఫుల్ స్టాక్ డ్రోన్ టెక్నాలజీ కంపెనీ ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్ డ్రోన్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా

డ్రోన్ ఫెస్టివల్‌లో Asteria Aerospace డ్రోన్‌ను ఎగరేసిన మోదీ

న్యూఢిల్లీ: బెంగళూరుకు చెందిన ఫుల్ స్టాక్ డ్రోన్ టెక్నాలజీ కంపెనీ ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్ డ్రోన్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2022 (Drone Festival of India 2022)లో పాల్గొంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA), డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DFI) కలిసి ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఈ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాయి. రెండు రోజులపాటు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్ రేపటి (శనివారం)తో ముగియనుంది.


ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించిన డ్రోన్‌ను ఎగురవేశారు. పరిశ్రమల రంగంలో భద్రత, నిఘా కోసం ఉద్దేశించిన డ్రోన్ ఇది. ఈ ఎగ్జిబిషన్‌లో 70కిపైగా ఎగ్జిబిటర్లు పాల్గొని వివిధ సందర్భాల్లో ఉపయోగించే డ్రోన్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ.. ఈ దశాబ్దం చివరి నాటికి భారతదేశాన్ని గ్లోబల్ డ్రోన్ హబ్‌గా మార్చాలనే ఆకాంక్షను వెల్లడించారు. ఈ విజన్‌ను సాకారం చేసేందుకు భారత ప్రభుత్వం పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తుందన్నారు.   


ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు నిహార్ వర్తక్ మాట్లాడుతూ.. తమ తర్వాతి తరం డ్రోన్లు, స్కైడెక్, తమ డ్రో న్ ఆపరేషన్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రదర్శించేందుకు ఇది గొప్ప అవకాశమని అన్నారు.  డ్రోన్ సాంకేతికత ప్రభావం చూపగల కొత్త మార్గాలను అన్వేషించడాన్ని కొనసాగిస్తామన్నారు. పరిశ్రమ రంగాల్లో భద్రత, నిఘా, సర్వేయింగ్, ఇన్‌స్పెక్షన్ అప్లికేషన్‌ల కోసం ఆస్టెరియా తమ డ్రోన్లను ప్రదర్శించింది. టెలికం రంగంలో అడుగుపెడుతూనే సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో అనుబంధ సంస్థే ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్ కావడం గమనార్హం. 



Updated Date - 2022-05-27T23:34:02+05:30 IST