ఉత్తమ పార్లమెంటేరియన్లు అసదుద్దీన్‌ ఒవైసీ, డెరెక్‌ ఓబ్రియన్‌

ABN , First Publish Date - 2022-03-18T06:48:25+05:30 IST

పార్లమెంటులో చేసిన కృషికి గాను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోని, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీలతో సహా ఎనిమిది మంది....

ఉత్తమ పార్లమెంటేరియన్లు అసదుద్దీన్‌ ఒవైసీ, డెరెక్‌ ఓబ్రియన్‌

అవార్డులను ప్రకటించిన లోక్‌మత్‌ సంస్థ 


న్యూఢిల్లీ, మార్చి 17: పార్లమెంటులో చేసిన కృషికి గాను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోని, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీలతో సహా ఎనిమిది మంది ఎంపీలకు లోక్‌మత్‌ గ్రూప్‌ అవార్డులను ప్రకటించింది. ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ప్రముఖ నేతలతో కూడిన జ్యూరీ 2022 సంవత్సరానికి అసదుద్దీన్‌ ఒవైసీ, తృణమూల్‌కు చెందిన డెరెక్‌ ఓబ్రియన్‌లను ‘పార్లమెంటేరియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుకు ఎంపిక చేసింది. జీవితకాల సాఫల్య పురస్కారానికి ఏకే ఆంటోని, భర్తృహరి మెహతాబ్‌ ఎంపికయ్యారు.


ఉత్తమ మహిళా పార్లమెంటేరియన్‌ విభాగంలో బీజేపీ లోక్‌సభ సభ్యురాలు లాకెట్‌ చటర్జీ, ఎన్సీపీ రాజ్యసభ సభ్యురాలు వందనా చవాన్‌, ఉత్తమ అరంగేట్ర పార్లమెంటేరియన్‌ విభాగంలో బీజేపీ లోక్‌సభ సభ్యురాలు తేజస్వీ సూర్య, ఆర్జేడీ రాజ్యసభ సభ్యురాలు మనోజ్‌ కుమార్‌ ఝాలు అవార్డులు దక్కించుకున్నారు. 4 సంవత్సరాల నుంచి ఏటా ఈ అవార్డులను లోక్‌సభ నుంచి నలుగురు, రాజ్యసభ నుంచి నలుగురు అత్యుత్తమ పార్లమెంటేరియన్లకు అందిస్తున్నారు. 

Updated Date - 2022-03-18T06:48:25+05:30 IST