Anthill: దిండుగల్ జిల్లాలో చీమల బెడద !
ABN , First Publish Date - 2022-08-19T16:44:25+05:30 IST
దిండుగల్ జిల్లాలోని కొండ ప్రాంతానికి చేరువుగా ఉన్న ఏడు గ్రామాల ప్రజలు వింత చీమలతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పపువా న్యూగునియా,
చెన్నై, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): దిండుగల్ జిల్లాలోని కొండ ప్రాంతానికి చేరువుగా ఉన్న ఏడు గ్రామాల ప్రజలు వింత చీమలతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పపువా న్యూగునియా, మారిషష్(Mauritius) తదితర దేశాల్లో మాత్రమే కనిపించే ఈ చీమలు.. ఆ ఏడుగ్రామాల్లో సంచరిస్తుండడం స్థానికులకు అర్థం కావడం లేదు. ఆ చీమలదండు దాడికి గురవుతున్న తమ పశువులు.. కంటి చూపును కోల్పోతున్నాయని, కోళ్ళు మృతి చెందుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. నోప్లోలిప్స్ గ్రేసిలిప్స్ అనే సాంకేతిక నామం కలిగిన ఆ పసుపు చీమలు వందరకాల హానికలిగించే వాటిలో ఒకటని ఐయూసీఎన్ సంస్థ ప్రకటించింది. దిండుగల్ జిల్లా కరాందమలై పక్కనున్న అటవీ ప్రాంతాల నుండి వస్తున్న ఆ చీమలు తమ శరీరంపై పాకితే మంటలు, బొబ్బలు ఏర్పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగేందుకు నీళ్లు(water) తీసుకున్నా, అందులోనూ ఆ చీమలు కనిపిస్తుండటంతో వాటిని అరికట్టడమెలాగో తెలియక సతమతమవుతున్నామన్నారు.