UP Election Result 2022: ఎన్నికల ఫలితాలు మొదలైన కాసేపటికే ఆసక్తికర ట్వీట్ చేసిన Akhilesh Yadav
ABN , First Publish Date - 2022-03-10T17:18:39+05:30 IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి బీజేపీయే అధికారంలోకి రాబోతోందని ఫలితాల తీరును చూస్తే అర్థం అవుతోంది. యూపీ సీఎంగా మరోసారి యోగీ పగ్గాలు చేపట్టనున్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి బీజేపీయే అధికారంలోకి రాబోతోందని ఫలితాల తీరును చూస్తే అర్థం అవుతోంది. యూపీ సీఎంగా మరోసారి యోగీ పగ్గాలు చేపట్టనున్నారు. 37 ఏళ్ల తర్వాత యూపీలో వరుసగా రెండోసారి ఒకే పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్ర పునరావృతం అయింది. యూపీలో బీజేపీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో అఖిలేష్ యాదవ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్నికల ఫలితాలు మొదలయిన కాసేపటి తర్వాత మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ను చేశారు.
‘పరీక్ష ఇంకా ముగియలేదు. నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కోసం, కూటమి గెలుపు కోసం అహర్నిశలూ కష్టపడిన పార్టీ వర్కర్లకు, మద్ధతుదారులకు, నాయకులకు, అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వాయ్య సిపాయిలు గెలుపు పత్రాన్ని తీసుకునే వస్తారు’ అంటూ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. ఎన్నికల కౌంటింగ్ మొదలయిన కొద్ది సేపటి తర్వాత ఆయన ఈ ట్వీట్ చేయడం గమనార్హం.