కర్ణాటకలో 21 మంది అధికారులపై ఏకకాలంలో ACB సోదాలు..
ABN , First Publish Date - 2022-06-17T16:21:48+05:30 IST
ఏసీబీ అధికారులు కర్ణాటకలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 21 మంది ప్రభుత్వ అధికారులపై దాడులు చేశారు.
బెంగళూరు: ఏసీబీ అధికారులు కర్ణాటకలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 21 మంది ప్రభుత్వ అధికారులపై దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రావడంతో తనిఖీలు నిర్వహించారు. ఏకకాలంలో 80 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేసింది. ఈ తనిఖీల్లో 300 మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.