యూపీలో మద్యానికి మరో 9 మంది బలి
ABN , First Publish Date - 2022-01-28T09:04:43+05:30 IST
యూపీలోని రాయ్బరేలీ జిల్లా పహర్పూర్లో మంగళవారం రాత్రి నకిలీ మద్యం తాగి ఆరుగురు చనిపోయిన దుర్ఘటన
లక్నో, జనవరి 27: యూపీలోని రాయ్బరేలీ జిల్లా పహర్పూర్లో మంగళవారం రాత్రి నకిలీ మద్యం తాగి ఆరుగురు చనిపోయిన దుర్ఘటన మరువకముందే.. అదే ఊర్లో బుధవారం మరో ఘోరం జరిగింది. ఓ పుట్టినరోజు వేడుకలో ‘విండీస్’ అనే లోకల్ బ్రాండ్ మద్యం తాగి 9 మంది మరణించగా.. 30మంది వరకూ చికిత్స పొందుతున్నారు.