MP వ్యాపారవేత్త ఇంట్లో రైడ్: రూ.8 కోట్లు సీజ్
ABN , First Publish Date - 2022-01-09T15:26:42+05:30 IST
శంకర్ రాయ్ గతంలో దామోహ్ నగర పాలిక సంస్థ చైర్మన్గా పని చేశారు. ఈయన కాంగ్రెస్ మద్దతుదారుడు. ఇక ఆయన తమ్ముడు కమల్ రాయ్ కూడా బీజేపీ మద్దతుతో దమోహ్ నగర పాలిక సంస్థ వైస్ చైర్మన్గా పని చేశారు..
భోపాల్: మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాకు చెందిన శంకర్ రాయ్ అనే వ్యాపారవేత్త ఇంట్లో లెక్కల్లో లేని కోట్ల రూపాయల సొత్తును ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో శంకర్ ఇంట్లో రైడ్ నిర్వహించారు. సుమారు 39 గంటల పాటు కొనసాగిన ఈ రైడ్లో మొత్తం 8 కోట్ల రూపాయల డబ్బు లభించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఇందులో కొటి రూపాయ నగదును ఓ బ్యాగ్లో సర్ది, ఆ బ్యాగ్ను వాటర్ ట్యాంక్లో దాచారు. వీటితో పాటు మూడు కిలోగ్రాముల బంగారాన్ని కూడా సీజ్ చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు.
శంకర్ రాయ్ గతంలో దామోహ్ నగర పాలిక సంస్థ చైర్మన్గా పని చేశారు. ఈయన కాంగ్రెస్ మద్దతుదారుడు. ఇక ఆయన తమ్ముడు కమల్ రాయ్ కూడా బీజేపీ మద్దతుతో దమోహ్ నగర పాలిక సంస్థ వైస్ చైర్మన్గా పని చేశారు. తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగుల పేర్లుతో డజనుకు పైగా వ్యాపారాలను వీళ్లు నిర్వహిస్తున్నారు. కాగా, శంకర్ రాయ్ వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందిస్తే 10,000 రూపాయల రివార్డ్ అందిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి భౌతిక రైడ్లు ముగిసాయని తదుపని విచారణ ప్రారంభమైందని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు.