38 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-04-05T16:39:55+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగా సాగుతున్నాయి. సోమవారం విడుదలైన బులెటిన్ ప్రకారం 38 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 36, దక్షిణకన్నడలో ఇద్దరు
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగా సాగుతున్నాయి. సోమవారం విడుదలైన బులెటిన్ ప్రకారం 38 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 36, దక్షిణకన్నడలో ఇద్దరు ఉన్నారు. 28 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. 52 మంది కోలుకోగా బెంగళూరులో ఒకరు మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది చికిత్సలు పొందుతుండగా అత్యధికంగా బెంగళూరులో 1400 మంది ఉన్నారు. పది జిల్లాల్లో యాక్టివ్ కేసులు లేవు. 8 జిల్లాల్లో ఒక్కొక్కరు చికిత్సలు పొందుతున్నారు.