29 మందికి Covid పాజిటివ్
ABN , First Publish Date - 2022-04-06T17:45:30+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు తక్కువగానే కొనసాగుతున్నాయి. మంగళవారం 29 పాజిటివ్ కేసులు నమోదు కాగా బెంగళూరులో 24, కలబుర్గిలో 2, బళ్లారి, దక్షిణకన్నడ, రామనగరలలో ఒక్కొక్కటి
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు తక్కువగానే కొనసాగుతున్నాయి. మంగళవారం 29 పాజిటివ్ కేసులు నమోదు కాగా బెంగళూరులో 24, కలబుర్గిలో 2, బళ్లారి, దక్షిణకన్నడ, రామనగరలలో ఒక్కొక్కటి నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో కేసులు లేవు. 61 మంది కోలుకోగా మృతులు లేకపోవడం ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1468 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 1377 మంది ఉన్నారు. 8 జిల్లాల్లో ఒక్కొక్కరు ఉండగా పది జిల్లాల్లో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదు.