ఉక్రెయిన్ యుద్ధంలో 112 మంది చిన్నారులు మృతి: అధికారి
ABN , First Publish Date - 2022-03-20T00:29:38+05:30 IST
ఉక్రెయిన్ యుద్ధంలో 112 మంది చిన్నారులు మృతి: అధికారి

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ దేశంపై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్లో జరిగిన యుద్ధంలో ఇప్పటివరకు కనీసం 112 మంది పిల్లలు మరణించారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం శనివారం తెలిపింది. దాదాపు 140 మంది చిన్నారులు గాయపడ్డారని పేర్కొంది. రష్యా దాడితో ఉక్రెయిన్ దేశంలో మరణించిన పిల్లల జ్ఞాపకార్థం ఎల్వివ్ నగరంలోని సెంట్రల్ స్క్వేర్లో ఖాళీ స్ట్రోలర్లు వరుసలో ఉన్నాయి.