ఈవీఎం స్ట్రాంగ్ రూం ఎదుట ఎస్పీ కార్యకర్తల నిరసన
ABN , First Publish Date - 2022-03-09T02:57:21+05:30 IST
దీనికి ముందు లఖ్నవూలోని సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిలేష్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం అధికారులు కొందరు ఈవీఎం ట్యాంపరింగ్కు పాల్పడుతున్నట్లు ఆరోపించారు..
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, వారణాసిలోని ఈవీఎం స్ట్రాంగ్ రూం ముందు సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ అఖిలేష్ ఆరోపించిన కొద్ది సేపటికే ఎస్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగడం విశేషం. మంగళవారం వారణాసిలోని పహారియా మండి ప్రాంతంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూం ముందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ఎస్పీ కార్యకర్తలు.. ‘సేవ్ డెమొక్రసీ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దీనికి ముందు లఖ్నవూలోని సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిలేష్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం అధికారులు కొందరు ఈవీఎం ట్యాంపరింగ్కు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అఖిలేష్ ఈ ఆరోపణలు చేయడం మరింత ఆసక్తి రేపుతున్నాయి. వాస్తవానికి ఈసారి కూడా అధికారంలోకి రాదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి.