Shocking: ఆ తల్లి ఎంత పని చేసింది.. ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2022-12-07T19:23:23+05:30 IST

కర్ణాటకలోని కోలార్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది.. అనంతరం తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. చుట్టు పక్కల వారు ఆపడంతో ఆమె బతికిపోయింది..

Shocking: ఆ తల్లి ఎంత పని చేసింది.. ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది.. కారణమేంటంటే..

కర్ణాటకలోని కోలార్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది.. అనంతరం తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. చుట్టు పక్కల వారు ఆపడంతో ఆమె బతికిపోయింది.. ఆమె కుమార్తెల్లో ఒకరు చనిపోగా, మరొ బాలిక ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స అందుకుంటోంది.. సమాచారం అందుకున్న పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకున్న ప్రశ్నిస్తున్నారు.

కోలార్ జిల్లా ముల్భాగల్‌లో నివసిస్తున్న జ్యోతి అనే మహిళ కొద్ది రోజులుగా తన భర్తతో గొడవ పడుతోంది. భర్తకు బుద్ది రావాలంటే తామందరం చనిపోవాలని నిర్ణయించుకుంది. బుధవారం ఉదయం పెట్రోల్ తీసుకొచ్చి తన ఇంట్లోనే ఇద్దరు కుమార్తెలపై పోసి నిప్పంటించింది. అనంతరం తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అయితే ఏదో మండుతున్న వాసన రావడంతో అప్రమత్తమైన పక్కింటి వారు వెంటనే అక్కడకు చేరుకుని జ్యోతిని కాపాడారు. కాలిపోయిన స్థితిలో ఉన్న పిల్లలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో జ్యోతి పెద్ద కూతురు చనిపోగా, చిన్న కూతురు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స అందుకుంటోంది. సమాచారం అందుకున్న పోలీసులు జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-12-07T19:23:26+05:30 IST