Shocking Crime: అన్నంలో చీమలు పడ్డాయని భార్యను తిట్టిన భర్త.. కోపంలో ఆ మహిళ ఎంత దారుణానికి తెగించిందంటే..
ABN , First Publish Date - 2022-11-27T20:05:44+05:30 IST
వైవాహిక జీవితంలో ఏర్పడే చిన్న చిన్న తగాదాలు ఒక్కోసారి భారీ నష్టాలను కలుగచేస్తాయి. భార్యభర్తల మధ్య మొదలయ్యే గిల్లికజ్జాలు తారస్థాయికి చేరి ప్రాణాంతకంగా మారుతాయి. ఒకరి ప్రాణాలు మరొకరు తీసే వరకు వెళతాయి. తాజాగా ఒడిశాలో అలాంటి ఘటనే జరిగింది.
వైవాహిక జీవితంలో ఏర్పడే చిన్న చిన్న తగాదాలు ఒక్కోసారి భారీ నష్టాలను కలుగచేస్తాయి. భార్యభర్తల మధ్య మొదలయ్యే గిల్లికజ్జాలు తారస్థాయికి చేరి ప్రాణాంతకంగా మారుతాయి. ఒకరి ప్రాణాలు మరొకరు తీసే వరకు వెళతాయి. తాజాగా ఒడిశాలో అలాంటి ఘటనే జరిగింది. భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్నపాటి తగాదా తీవ్ర స్థాయికి చేరుకుని హత్యకు దారి తీసింది. ఒడిశాలోని (Odisha) సుందర్ గఢ్ జిల్లాలో ఒక మహిళ తన భర్తను క్షణికావేశంలో చంపేసింది.
సుందర్ గఢ్ జిల్లాకు చెందిన హేమంత బాఘ్(35), సరిత(30) భార్యాభర్తలు. వీరికి హేమలత, సౌమ్య అనే కుమార్తెలు ఉన్నారు. హేమంత్ ట్రక్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తుండగా తన ప్లేట్లో ఉన్న అన్నంలో హేమంతకు చీమలు కనిపించాయి. దీంతో అన్నంలోకి చీమలు ఎలా వచ్చాయని భార్యను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ తారస్థాయికి చేరుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన సరిత క్షణికావేశంలో భర్త గొంతును స్కార్ఫ్తో నులిమి (Wife kills husband after fight over ants in rice) చంపేసింది. హేమంత తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సరితను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.