అమ్మను నాన్నే చంపేశాడు.. నేను చూశా.. 5 ఏళ్ల బాలుడు కోర్టులో చెప్పిన మాటలివి.. అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-11-30T15:59:49+05:30 IST
ఆ వ్యక్తికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. ఐదేళ్ల కొడుకు ఉన్నాడు.. రెండున్నర ఏళ్ల క్రితం భార్యను చంపేశాడు.. ఆ సమయంలో ఐదేళ్ల కొడుకు మాత్రమే ప్రత్యక్ష సాక్షి.. అతడి సాక్ష్యం ఆధారంగానే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.. చివరకు..
ఆ వ్యక్తికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. ఐదేళ్ల కొడుకు ఉన్నాడు.. రెండున్నర ఏళ్ల క్రితం భార్యను చంపేశాడు.. ఆ సమయంలో ఐదేళ్ల కొడుకు మాత్రమే ప్రత్యక్ష సాక్షి.. అతడి సాక్ష్యం ఆధారంగానే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.. రెండున్నరేళ్లు ఈ కేసులను విచారించిన కోర్టు ఆ బాలుడి వాంగ్మూలం ఆధారంగానే నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఝాన్సీలోని కర్గువాన్జీ గ్రామానికి చెందిన పూనమ్కు 12 ఏళ్ల క్రితం రాకేష్తో వివాహమైంది. పెళ్లి తర్వాత పూనమ్ను రాకేష్ తరచుగా వేధించేవాడు. కట్నం కోసం వేధించేవాడు. తరచుగా శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. చివరకు 2020లో తన భర్యాను కొట్టి చంపేశాడు. ఈ హత్యకు ఆ దంపతుల 5 ఏళ్ల కొడుకు ఒక్కడే ప్రత్యక్ష సాక్షి. ఆ బాలుడి మాటలు ఆధారంగానే పోలీసులు రాకేష్ను అరెస్ట్ చేశారు. రెండున్నరేళ్ల పాటు ఆ కేసును కోర్టు విచారించింది. చివరకు ఆ బాలుడి వాంగ్మూలం ఆధారంగా రాకేష్కు పదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది.