ప్రధాని సభాస్థలి పరిశీలన
ABN , First Publish Date - 2022-06-26T05:52:49+05:30 IST
ప్రధాని పర్యటనకు సంబంధించి వివిధ శాఖలకు కేటాయించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఆర్అండ్బీ ప్రిన్సిపల్ కార్యదర్శి యంటి కృష్ణబాబు ఆదేశించారు.
కాళ్ళ,
జూన్ 25 : ప్రధాని పర్యటనకు సంబంధించి వివిధ శాఖలకు కేటాయించిన పనులు
త్వరితగతిన పూర్తి చేయాలని, పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని
రాష్ట్ర ఆర్అండ్బీ ప్రిన్సిపల్ కార్యదర్శి యంటి కృష్ణబాబు ఆదేశించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ
జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ జూలై 4న భీమవరం
రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. పెదఅమిరంలో 4
హెలీప్యాడ్లు, సభా స్థలా న్ని, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో
హెలీప్యాడ్, ఏఎస్ఆర్ నగర్లో అల్లూరి పార్కులో అల్లూరి విగ్రహాన్ని
పెట్టే ప్రదేశాన్ని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతితో కలిసి పరిశీలించారు.
జేసీ జేవీ మురళి, రహదారుల భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్, భవనాల శాఖ
చీఫ్ ఇంజనీర్ పీసీ రమేష్కుమార్, భీమవరం ఆర్డీవో దాసిరాజు, వివిధ శాఖల
జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.