కాల్వలో నీళ్లొచ్చిన తర్వాత తవ్వకం పనులు !
ABN , First Publish Date - 2022-06-07T06:40:56+05:30 IST
ఓ వైపు కాల్వలకు నీటిని విడుదల చేశారు.
ఉండి, జూన్ 6 : ఓ వైపు కాల్వలకు నీటిని విడుదల చేశారు. మరోవైపు వర్షాలు మొదలయ్యాయి. ఈ సమయంలో యండ గండి మీడియం డ్రెయిన్ అభివృద్ధి పనులు చేపట్టారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ నెలాఖరున కాలువలను మూసి వేశా రు. తిరిగి జూన్ 1న నీటిని విడుదల చేశారు. దీంతో ఆయా పం ట కాలువలకు, డ్రెయిన్లలోకి నీరు వచ్చింది. ఇప్పుడు హడావుడి గా అధికారులు మట్టి తీత పనులను ఎక్స్కవేటర్తో చేపట్టారు. డ్రెయిన్లో పూర్తిగా నీరు నిండుకుంది. దీనికితోడు వర్షపు చినుకుల లోనే పనులను చేపట్టారు. రెండు కిలోమీటర్ల మేర రూ.6.50 లక్షల విలువైన తవ్వకం పనులను చేయనున్నారు. ఈ సమ యంలో పనులను చేపట్టడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. పనులను చేసేటపుడు నాణ్యతతో చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ డ్రెయిన్ యండగండి పంట కాలువ నుంచి పాములపర్రులో బొండాడ డ్రెయిన్లో కలుస్తోంది. అయితే ఈ డ్రెయిన్ అభివృద్ధి పనులు మాత్రం కేవలం రెండు కిలోమీటర్లు మట్టితీత పనులను చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.