సంక్రాంతి దృష్ట్యా భీమవరం, ఉండిలో అవగాహన సదస్సులు
ABN , First Publish Date - 2022-01-12T15:45:56+05:30 IST
సంక్రాంతి పండుగ దృష్ట్యా భీమవరం, ఉండిలో పోలీస్, రెవెన్యూ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
ఏలూరు: సంక్రాంతి పండుగ దృష్ట్యా భీమవరం, ఉండిలో పోలీస్, రెవెన్యూ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. జూదం వద్దు.. సాంప్రదాయం ముద్దు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పోలీస్, రెవెన్యూ అధికారులు గ్రామాల్లో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. అధికారులు ఇంత చేస్తున్నప్పటికీ వారి సూచనలను పందెంరాయుళ్లు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. కోడి పందాల కోసం నిర్వాహకులు బరులను సిద్ధం చేస్తున్నారు.