భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణం

ABN , First Publish Date - 2022-11-04T23:51:53+05:30 IST

కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సహిత భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వార్షిక కల్యాణం శుక్రవారం వైభవంగా జరిగింది.

భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కల్యాణం
108 బిందెలతో జలం తీసుకొస్తున్న మహిళలు, స్వామి వారికి అభిషేకం

ఆకివీడు, నవంబరు 4: కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సహిత భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వార్షిక కల్యాణం శుక్రవారం వైభవంగా జరిగింది. ఉదయం స్వామికి అభిషేకం, మహిళలు 108 బిందెల గంగాజలం తీసుకువచ్చి భద్రకాళీ సమేత వీరభద్రస్వామికి జలాభిషేకం చేశారు. సాయంత్రం మహిళలు సామూహిక కుంకు మ పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు స్వామి కల్యాణం చేయించారు. రాత్రి స్వామి ప్రభ ఊరేగింపు, శూలాల సంబరం జరిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ బత్తుల శ్యామల, కమిటీ సభ్యుల సిద్ధాని విశ్వేశ్వరరావు, శ్రీనివాసరావు, అందే భద్రం, బేసే నాగన్న, శలా నాగేశ్వరరావు, భాస్కరరావు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-11-04T23:51:59+05:30 IST