ఉద్యోగుల వెంటే తెలుగుదేశం : వలవల బాబ్జి
ABN , First Publish Date - 2022-01-21T05:03:58+05:30 IST
వేతనాల కుదింపుపై పోరాటం చేస్తున్న ఉద్యోగుల వెంట తెలుగుదేశం పార్టీ ఉంటుందని టీడీపీ తాడేపల్లిగూ డెం నియోజక వర్గ ఇన్చార్జి వలవల బాబ్జి తెలిపారు.
తాడేపల్లిగూడెం, జనవరి 20 (ఆంధ్ర జ్యోతి) :వేతనాల కుదింపుపై పోరాటం చేస్తున్న ఉద్యోగుల వెంట తెలుగుదేశం పార్టీ ఉంటుందని టీడీపీ తాడేపల్లిగూ డెం నియోజక వర్గ ఇన్చార్జి వలవల బాబ్జి తెలిపారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల ఉద్యమానికి పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఎన్నికల్లో సీపీఎస్ రద్దు, వేతన సవరణ అమలు వంటి లెక్కకు మిక్కిలి వాగ్దానాలు గుప్పించిన సీఎం జగన్ ఇప్పుడు వేతనాలను కుదించడం సమంజసం కాదని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు బ డుగు పెద్ద, తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు ఎం.ధరేంద్ర మాట్లాడారు. నాయకులు సూర్పన వెంకట్రావు, అబ్బిన కృష్ణమూర్తి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.