ఎమ్మెల్సీని అరెస్టు చేయాలి
ABN , First Publish Date - 2022-05-22T05:30:00+05:30 IST
ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి దానిని యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దారుణమని వెంటనే ఎమ్మెల్సీ అనంత బాబును అరెస్టు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.
టీడీపీ ఆధ్వర్యంలో నిరసనలు
జంగారెడ్డిగూడెం, మే 22 : ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి దానిని యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దారుణమని వెంటనే ఎమ్మెల్సీ అనంత బాబును అరెస్టు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజుపై కాకినాడలో జరిగిన దాడిని జిల్లా టీడీపీ కార్య నిర్వహణ కార్యదర్శి బొబ్బర రాజ్పాల్కుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రామారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య నిర్వహణ కార్యదర్శి పాతూరి అంబేడ్కర్లు తీవ్రంగా ఖండిం చారు. ఆదివారం బస్టాండ్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గొల్లమందల శ్రీనివాసరావు అధ్యక్షతన నిర సన వ్యక్తం చేశారు. అసమర్ధత జగన్ పాలనలో హత్యలు, హత్యాచారాలు పెరిగి పోతు న్నాయన్నారు. గుంటూరులో అధికార పార్టీ నాయకులచే దాడికి గురైన వెంకాయమ్మ కుటుంబానికి, కాకినాడలో హత్యకు గురైన సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ, పెసరగంటి జయరాజు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు యడ్లపల్లి ఏడుకొండలు, తానిగడప సుమలత, యాకుబ్, కోండ్రు నాగరాజు, బేతాళ మురళి, రాంబాబు, తోట కృపావరం, వెంపల రాజు తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు టూటౌన్ : దళిత యువకుడు సుబ్రహ్మణ్యం మృతికి కారణమైన ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయ కుడు దాసరి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఆదివారం పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతబాబును మండలి నుంచి బర్త్రఫ్ చేయాలన్నారు. టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజుపై పోలీసులు చేసిన దాడిని నిరసించారు. దాడిచేసిన డీఎస్పీపై చర్యలు తీసు కోవా లని అన్నారు. జాలా బాలాజీ, వెంకటరమణ, లంకపల్లి మాణి క్యాలరావు, ఎం.వెంకన్న, శ్రీనివాస్, పండు, లోవరాజు, యోహాను, గంగ రాజు, రమేష్, ఎం.రంజిత్, వెలమల వెంకటేశ్వరరావు, రవీంద్ర పాల్గొన్నారు.
భీమడోలు : అనంతబాబును పోలీసులు తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని భీమడోలు అఖిలపక్ష దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. భీమ డోలు సంతమార్కెట్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద కులవిక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష దళిత సంఘాలు నిరసన చేపట్టారు. కేవీపీఎస్ మండల కన్వీనర్ సుమన్బాబు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కొయ్యలగూడెం : బయ్యన్నగూడెం గ్రామంలో టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. మాజీ ఏఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు రోజురోజుకు పెరుగుతు న్నాయన్నారు. వెంటనే దోషులను శిక్షించాలని కోరారు. జిల్లా లీగల్సెల్ కార్యదర్శి వెంకటేశ్వరరావు, మండల ఎస్సీ సెల్ ఉప్పాటి వెంకట్రావు, పారేపల్లి నరేష్, తదితరులు పాల్గొన్నారు.