వైసీపీ పాలనలో బీసీలకు ఇదేం ఖర్మ

ABN , First Publish Date - 2022-12-07T00:17:55+05:30 IST

రాష్ట్రంలో బీసీలను అణచివేయడమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతుందని, బీసీలకు ఇదేం ఖర్మ అని టీడీపీ బీసీ విభాగం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

వైసీపీ పాలనలో బీసీలకు ఇదేం ఖర్మ
తాడేపల్లిగూడెంలో మోకాళ్లపై కూర్చుని టీడీపీ నేతల నిరసన

భీమవరం అర్బన్‌, డిసెంబరు 6: రాష్ట్రంలో బీసీలను అణచివేయడమే లక్ష్యంగా వైసీపీ పాలన సాగుతుందని, బీసీలకు ఇదేం ఖర్మ అని టీడీపీ బీసీ విభాగం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. భీమవరం నియోజవర్గ బీసీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ అధ్యక్షుడు పడమట సోమేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారధి, కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బీసీ సబ్‌ ప్లాన్‌ నిధుల నుంచి స్థానిక సం స్థలో రిజర్వేషన్ల వరుకు ప్రతి అంశంలో వైసీపీ ప్రభుత్వం అన్యాయం చే స్తుందన్నారు. మెరగాని నారాయణమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విధానాలతో బీసీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో రద్దు చేసిన 10శాతం రిజర్వేషన్లు పునరుద్ధరణకు శాసన సభలో తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. వీరవల్లి చంద్రశేఖర్‌, కము జు హరిబాబు, గంటా త్రిముర్తులు, కౌరు పృద్విశంకర్‌, రేవు వెంకన్న, మా మిడిశెట్టి ప్రసాద్‌, కొల్లేపర శ్రీనివాస్‌, వీరవల్లి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

నరసాపురం: జగన్‌ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని అగ్ని కుల క్షత్రియ రాష్ట్ర కన్వీనర్‌ కొప్పాడ రవి విమర్శించారు. టీడీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. నియో జకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, కొవ్వలి నాయుడు, రవి మాట్లాడుతూ చంద్రబాబు వల్లే బీసీలకు రాజకీయంగా, ఆర్థిక, ఉపాధి రంగాల్లో న్యాయం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం పేరుకే 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ సూర్యతేజకు వినతిపత్రం అందించారు. కొల్లు పెద్దిరాజు, పొన్నా ల నాగబాబు, వాతాడి ఉమా, శశిదేవి, గుబ్బల నాగరాజు, జోగి పండు, శ్రీదేవి, నడిపూడి కృష్ణ, పట్నల జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెం అర్బన్‌: వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గొర్రెల శ్రీధర్‌ అన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి ఆధ్వర్యంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పట్టణంలో టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. శ్రీధర్‌ మా ట్లాడుతూ టీడీపీ హయాంలో బీసీలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు నేడు అమలు కావడం లేదన్నారు. కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్‌, వాడపల్లి సుబ్బరాజు, ముప్పిడి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:17:58+05:30 IST