ఎన్టీఆర్ పేదల పాలిట పెన్నిధి : రామకృష్ణ
ABN , First Publish Date - 2022-09-05T05:15:25+05:30 IST
స్వర్గీయ ఎన్టీఆర్ పేదల పాలిట పెన్నిధి అని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ అన్నారు.
ఏలూరుటూటౌన్, సెప్టెంబర్ 4: స్వర్గీయ ఎన్టీఆర్ పేదల పాలిట పెన్నిధి అని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్లో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం ఆదివారంతో 100 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా రామకృష్ణ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తొలుత ముఖ్య మంత్రి అయిన తరువాత తిరుపతిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉచిత అన్నదాన కార్య క్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన శతజయంతి ఉత్స వాలను పురస్కరించుకుని రాష్ట్రమంతటా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిం చటం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి), మాజీ శాసన సభ్యులు చింతమనేని ప్రభాకర్, టీడీపీ కార్యదర్శి పాలిప్రసాద్, నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ బీబీజీ తిలక్, గోవర్దన్, రమేష్, ఎన్టీఆర్ ప్రసాద్, నాగరాజు, దివాకర్, రాఘవ, తదితరులు పాల్గొన్నారు.