స్మోక్‌ ఫ్రీ ప్రాంతంగా శ్రీవారి క్షేత్రం

ABN , First Publish Date - 2022-12-10T00:06:45+05:30 IST

శ్రీవారి సన్నిఽధిని పవిత్రంగా ఉంచాలన్న భావనతో పాటు, పలువురికి ఆదర్శంగా ఉండేలా క్షేత్రాన్ని స్మోక్‌ఫ్రీ ప్రాంతంగా ఉంచేందుకు సిబ్బంది కృషి చేయాలని దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు అన్నారు.

స్మోక్‌ ఫ్రీ ప్రాంతంగా శ్రీవారి క్షేత్రం
ప్రతిజ్ఞ చేయిస్తున్న ఆలయ అధికారులు

ద్వారకాతిరుమల, డిసెంబరు 9 : శ్రీవారి సన్నిఽధిని పవిత్రంగా ఉంచాలన్న భావనతో పాటు, పలువురికి ఆదర్శంగా ఉండేలా క్షేత్రాన్ని స్మోక్‌ఫ్రీ ప్రాంతంగా ఉంచేందుకు సిబ్బంది కృషి చేయాలని దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు అన్నారు. శ్రీవారి శేషాచలంపై ఉన్న మాధవ కల్యాణమండప ఆవరణలో శుక్రవారం ఆలయ సిబ్బందికి, భద్రతా సిబ్బందికి ఆలయ పరిధిలో ధూమపానం, పొగాకు ఉత్పత్తుల విని యోగం, అమ్మకాలను నిషేధిస్తూ స్మోక్‌ఫ్రీ ప్రాంతంగా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా పొగాకు ఉత్పత్తులకు ఈరోజు నుంచే దూరంగా ఉంటా మని సిబ్బంది, అధికారులు ప్రతిజ్ఞ చేశారు. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధి కారి డాక్టర్‌ నాగేశ్వరరావు., ఈఈ రాజు,ఏఈవోలు మెట్టపల్లి దుర్గారావు, పి.నటరాజారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:06:46+05:30 IST