దుకాణాల్లో తనిఖీలు
ABN , First Publish Date - 2022-12-31T01:26:41+05:30 IST
ఏలూరు జిల్లా రెడ్క్రాస్ మాజీ చైౖర్మన్, మాజీ ఉపముఖ్య మంత్రి ఆళ్ల నాని ప్రధాన అనుచరుల్లో ఒకరైన జయప్రకాష్ (జేపీ)కి చెందిన ఎరువుల దుకాణాలను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జేసీ అరుణ్బాబు శుక్రవారం తనిఖీలు నిర్వహించడం సంచలనం రేపింది.
ఏలూరు రూరల్, డిసెంబరు 30 : ఏలూరు జిల్లా రెడ్క్రాస్ మాజీ చైౖర్మన్, మాజీ ఉపముఖ్య మంత్రి ఆళ్ల నాని ప్రధాన అనుచరుల్లో ఒకరైన జయప్రకాష్ (జేపీ)కి చెందిన ఎరువుల దుకాణాలను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జేసీ అరుణ్బాబు శుక్రవారం తనిఖీలు నిర్వహించడం సంచలనం రేపింది. ఉదయం స్థానిక గన్బజార్లో జేపీకి చెందిన శ్రీరామాంజనేయ మెన్యూర్స్ దుకాణంలోకి సంయుక్తంగా వెళ్లి గంటకుపైగా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వేసి ఉన్న షర్టర్ను తీయించి మరీ లోపలికి వెళ్లి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితరాలను పరిశీలించి వాటి వివరాలను అడిగారు. దుకాణంలో కొన్ని మెడికల్ కిట్లు, మాస్క్లు గుర్తించి వెంటనే డీఎంహెచ్వోను పిలిపించి విచారించమని ఆదేశించారు. అక్కడ నుంచి వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, తహసీల్దార్ బి.సోమశేఖర్ను దుకాణాన్ని పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదిక అందజేయాలని ఆదేశించి వెళ్లారు. రికార్డులను, స్టాక్ నిల్వలు, బిల్లు పుస్తకాలు, స్టాక్ ఇన్వాయిస్లను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ 16 రకాల ఎరువులు, లైసెన్సులు వీటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. కంపెనీలు చేస్తున్న సరఫరా, స్టాక్ బ్యాలెన్స్ను నిశితంగా పరిశీలించారు. పరిశీలనలో అన్నీ సంక్రమంగా ఉన్నట్లు వ్యవసాయశాఖ జేడీ పేర్కొన్నారు. నివేదికను కలెక్టర్కు అందజేస్తామన్నారు.