ప్రతీ మహిళా హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2022-12-09T23:52:19+05:30 IST

ప్రతీ మహిళ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఐసీడీఎస్‌ పీడీ బి.సుజాతారాణి అన్నారు.

ప్రతీ మహిళా హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
మహిళలపై హింస వద్దని విస్సాకోడేరులో ర్యాలీ

పాలకోడేరు, డిసెంబరు 9: ప్రతీ మహిళ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఐసీడీఎస్‌ పీడీ బి.సుజాతారాణి అన్నారు. విస్సాకోడేరులోని ఐసీడీ ఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం వద్ద శుక్రవారం మహిళలపై హింస వద్దు.. సురక్షితమైన సమాజం కావాలనే అంశంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సుజాతారాణి మాట్లాడుతూ బాలికలను రక్షించే చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ శోభారాణి మాట్లాడుతూ అనాథ పిల్లలకు ఉచితంగా వసతి కల్పించి చదువు చెప్పడం జరుగుతుందన్నారు. విస్సాకోడేరు పీవో విజయరత్నంతో పాటు జిల్లా నుంచి వచ్చిన సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:52:22+05:30 IST