పోస్టల్ ఉద్యోగుల ఒక రోజు సమ్మె
ABN , First Publish Date - 2022-08-11T05:28:34+05:30 IST
తపాలా శాఖను కార్పొరేట్, ప్రెవేటీకరణను నిరసిస్తూ పోస్టల్ ఉద్యోగులు బుధవారం ఒక రోజు సమ్మె చేశారు.
పాలకొల్లు అర్బన్, ఆగస్టు 10: తపాలా శాఖను కార్పొరేట్, ప్రెవేటీకరణను నిరసిస్తూ పోస్టల్ ఉద్యోగులు బుధవారం ఒక రోజు సమ్మె చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన టీటీ, మోడరైజేషన్ 2.0కు నిరసనగా సమ్మె చేస్తున్నట్టు తెలిపారు. గ్రూప్ సి బ్రాంచ్ కార్యదర్శి వి.సర్వారాయుడు, పోస్ట్మ్యాన్, ఎంటీఎస్ బ్రాంచ్ కార్యదర్శి జిఎస్ఆర్ నాగ రాజు, ఎన్ఎఫ్పీఈ కార్యదర్శి సీహెచ్ఎ.సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొ న్నారు. సమ్మెకు తపాలా ఉద్యోగుల మద్దతు ప్రకటించారు.