పూర్వ విద్యార్థుల కలయిక
ABN , First Publish Date - 2022-04-11T05:08:09+05:30 IST
పూర్వ విద్యార్థులు 37 ఏళ్ళ తరువాత కలుసుకున్నారు.
ఏలూరు రూరల్, ఏప్రిల్ 10 : పూర్వ విద్యార్థులు 37 ఏళ్ళ తరువాత కలుసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. 1985వ విద్యా సంవత్సరంలో చాటపర్రు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది. ఆనాటి గురువులను సత్కరించారు. ప్రతీ పాఠశాల గదిని పరిశీలించి ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అంతా కలిసి భోజనం చేశారు.