ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడి రక్తదానం

ABN , First Publish Date - 2022-12-07T00:20:09+05:30 IST

ఎమ్మెల్యే నిమ్మల నిమ్మ ల రామానాయుడు 25వ సారి రక్తదానం చేశారు.

ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడి రక్తదానం
రక్త దానం చేస్తున్న ఎమ్మెల్యే నిమ్మల

పాలకొల్లు అర్బన్‌, డిసెంబరు 6: ఎమ్మెల్యే నిమ్మల నిమ్మల రామానాయుడు 25వ సారి రక్తదానం చేశారు. ఆయన తండ్రి ధర్మారావు పేరుతో నెలకొల్పిన ధర్మారావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగ ళవారం పలు సేవా కార్యక్ర మాలు చేపట్టారు. అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక అంబేధ్కర్‌ భవనంలో 77వ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన రక్తదానం చేసారు. యువకులకు క్రికెట్‌, వాలీబాల్‌ కిట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, కర్నేన గౌరునా యుడు, గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చెట్టి బాబు, ధనాని ప్రకాష్‌, కర్నేన రోజా రమణి, బ్లడ్‌ బ్యాంక్‌ అధినేత ముచ్చర్ల సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:20:13+05:30 IST