Bhimavaramకు బయలుదేరిన కేంద్ర మంత్రి Kishan Reddy
ABN , First Publish Date - 2022-06-12T15:30:13+05:30 IST
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు.
Krishna జిల్లా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కిషన్ రెడ్డి రోడ్డు మార్గాన నేరుగా భీమవరంకు బయలుదేరారు.
కిషన్ రెడ్డి ఆదివారం భీమవరంలో పర్యటించనున్నారు. జూలై 4న భీమవరంలో ప్రధాని మోదీ పాల్గొనే అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు మోగల్లు చేరుకుని విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళి అర్పించి, అల్లూరి ధ్యాన మందిరాన్ని సందర్శించనున్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కళా కేంద్రంలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. బీజేపీ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో కిషన్ రెడ్డితో పాటు సోము వీర్రాజు, స్థానిక నేతలు పాల్గొననున్నారు.