గోనె సంచులు అందుబాటులో ఉంచాలి : జేసీ
ABN , First Publish Date - 2022-12-07T00:42:06+05:30 IST
రైతులకు అవసరమయ్యే గోనె సంచులను మిల్లర్లు అందుబా టులో ఉంచాలని జేసీ పి.అరుణ్బాబు సూచించారు.
జంగారెడ్డిగూడెం, డిసెంబరు 6 : రైతులకు అవసరమయ్యే గోనె సంచులను మిల్లర్లు అందుబా టులో ఉంచాలని జేసీ పి.అరుణ్బాబు సూచించారు. మంగళవా రం స్ధానిక పాత బస్టాండ్లోని విష్ణు ప్రియ మోడరన్ రైస్ మిల్లులో రైతుల దగ్గర నుంచి సేకరించిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ ధాన్యం తెచ్చిన లారీలను అన్లోడ్ చేసిన వెంటనే పంపించాలన్నారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో ఎటు వంటి ఇబ్బందులు, అవకతవకలు తలెత్తకుండా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆర్డీవో ఝాన్సీరాణి, తహసీల్దార్ కె.స్లీవజోజి, పౌరసర