లింగ వివక్షలేని సమాజం అందరి బాధ్యత

ABN , First Publish Date - 2022-12-09T23:56:36+05:30 IST

లింగ వివక్షతలేని సమాజం అందరి బాధ్యత అని ఇన్‌చార్జి డీఆర్వో కె.పెంచల కిషోర్‌ అన్నారు.

లింగ వివక్షలేని సమాజం అందరి బాధ్యత
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఇన్‌చార్జి డీఆర్వో పెంచల కిషోర్‌

ఏలూరు కలెక్టరేట్‌, డిసెంబరు 9 :లింగ వివక్షతలేని సమాజం అందరి బాధ్యత అని ఇన్‌చార్జి డీఆర్వో కె.పెంచల కిషోర్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మహిళలపై జరిగే హింస వ్యతిరేక పక్షోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివక్షత లేని సమాజం కోసం చేపట్టే కార్యక్రమంలో భాగంగా ఐసీడీఎస్‌ రీజనల్‌ ఆర్గనైజర్‌ వందనపు సాయిబాలపద్మ, మహిళా కమిషన్‌ సభ్యులు భూసి వినీత, బాలల హక్కుల కమిషన్‌ సభ్యులు జె. రాజేంద్ర ప్రసాద్‌తో కలసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ లింగ వివక్షతను సమూలంగా నిర్మూలించడానికి సమష్టి కృషి అవసరమన్నారు. లింగవివక్షత నిర్మూలనకు ప్రజలను చైతన్య పర్చడం అవసరం అన్నారు. ఇటీవల నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

Updated Date - 2022-12-09T23:56:38+05:30 IST