ఇళ్ల స్థలాల ఫైల్ మాయం
ABN , First Publish Date - 2022-12-07T00:33:39+05:30 IST
:పెన్నాడలో 2009కు సంబంధించిన ఇళ్ల స్థలాల డాక్యుమెంట్స్ (దస్త్రం) దొంగతనానికి గురైంది.
తహసీల్దార్ ఫిర్యాదుతో కేసు
పాలకోడేరు, డిసెంబరు 6 :పెన్నాడలో 2009కు సంబంధించిన ఇళ్ల స్థలాల డాక్యుమెంట్స్ (దస్త్రం) దొంగతనానికి గురైంది. దీనిపై పాలకోడేరు తహసీల్దార్ షేక్ హుస్సేన్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పాలకోడేరు పోలీసులు తెలిపారు. పెన్నాడలో 2009లో 61 మందికి రెండున్నర సెంట్ల చొప్పున అప్పటి అధి కారులు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. ఇవి ఎవరికి ? ఎంత మందికి ? ఇచ్చారని గ్రామానికి చెందిన బీరా వెంకట సత్యనారాయణ అప్పటి లోన్, రికా ర్డు అసిస్టెంట్ జి.ఆదిశేషయ్యనాయుడు, ఉన్న తాధికారులను ఆర్టీఏ రూపంలో సమాచారం అడిగారు. రెండు పర్యాయాలు అడిగినా సమాచారం లేకపోవడంతో ఆర్జేఏ యాక్ట్ సమాచార కమిషనర్కు మరోమారు ఫిర్యాదుచేశాడు. ఈ స్థలాల విషయం తేల్చాలని కమిషనర్ జిల్లా అధికారులను ఆదేశించడంతో తహసీల్దార్ తన కార్యాలయంలో వెతికించారు. అవి దొరకకపోవడంతో ఆర్డీవో సూచన మేరకు దస్త్రాలు దొంగిలించినట్లు భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.