‘నాడు–నేడు’కు వెళుతూ హెచ్ఎం మృతి
ABN , First Publish Date - 2022-06-03T05:24:50+05:30 IST
నాడు–నేడు పనులు శంకు స్థాపన కార్యక్రమానికి బయలు దేరిన ప్రధానోపాధ్యా యుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
నిడమర్రు జూన్ 2 : నాడు–నేడు పనులు శంకు స్థాపన కార్యక్రమానికి బయలు దేరిన ప్రధానోపాధ్యా యుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నిడ మర్రు మండలం ఫత్తేపురం ఉన్నత పాఠశాల హెచ్ఎం హరికృష్ణ గురువారం పాఠశాల ఆవరణలో ప్రారంభించనున్న పనులు శంకుస్థాపన కార్యక్రమా లకు హజరయ్యే నిమిత్తం బైక్పై బయలు దేరారు. ఫత్తేపురం పొలిమేరలో కృష్ణుడి గుడివద్ద రోడ్డుపై గల స్పీడ్బ్రేకర్ వేగంగా దాటుతుండగా అదపుతప్పి పడి పోయారు. తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం అవడంతో స్థానికులు వెంటనే భీమవరం ఆసుపత్రికి తరలించారు. భీమవరం ఆసుపత్రిలో బ్రెయిన్కు సర్జరీ చేసినప్పటికీ ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.హెచ్ఎం హరికృష్ణ మృతిపట్ల ఎమ్మెల్యే వాసుబాబు సంతాపం తెలిపారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ హెచ్ఎం కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి యూటీఫ్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.నిడమర్రు మండలం యూటీఫ్, ఏపీటీఫ్, ఉపాధ్యాయ సంఘ నాయకులు సంతాపం తెలిపారు.