23న విద్యా సంస్థలు బంద్
ABN , First Publish Date - 2022-08-19T05:01:30+05:30 IST
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగే విద్యాసంస్థల బంద్కు ప్రైవేట్, కార్పోరేట్, ప్రభుత్వ విద్యాసంస్థల యాజమాన్యం సహకరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి సీహెచ్.నాగరాజు, ఎస్ ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్సాయిలు విజ్ఞప్తి చేశారు.
భీమవరం అర్బన్, ఆగస్టు 18: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగే విద్యాసంస్థల బంద్కు ప్రైవేట్, కార్పోరేట్, ప్రభుత్వ విద్యాసంస్థల యాజమాన్యం సహకరించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి సీహెచ్.నాగరాజు, ఎస్ ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్సాయిలు విజ్ఞప్తి చేశారు. గురువారం చెన్నరంగనిపాలెంలో విద్యార్ధి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ పోస్టర్లు ఆవిష్కరించారు. చెల్లబోయిన రంగారావు, ఎం.లక్ష్మిపతి, ఎం.వెంకట్ సీహెచ్.విజయ సుందర్, ఎల్ సురేంద్ర, వి.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.