డీటీపై కలెక్టర్కు నివేదిక
ABN , First Publish Date - 2022-04-24T05:53:39+05:30 IST
డీటీపై కలెక్టర్కు నివేదిక
నర్సాపురం, ఏప్రిల్ 23: రేషన్కు బదులు నగదు పంపిణీ సర్వేలో నర్సాపురం సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్ చేసిన వ్యాఖ్యలపై కలెక్టర్ ప్రశాంతికి సబ్ కలెక్టర్ నివేదిక ఇచ్చారు. సివిల్ సప్లయిస్ అధికారిణి సైతం కలెక్టర్కు శనివారం వివరణ ఇచ్చారు. ప్రభుత్వం చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్పై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. దీనికి డిప్యూటీ తహసీల్దార్ చేసిన వ్యాఖ్యలు మరింత ఊతమిచ్చాయి. అన్నింటినీ పరిశీలించిన అనంతరం డీటీపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని నర్సాపురంలో ప్రచారం జరుగుతోంది.