శాశ్వత భూహక్కు ప్రజలకు వరం : మంత్రి
ABN , First Publish Date - 2022-05-28T06:01:14+05:30 IST
జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం ప్రజలకు వరమని దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్, మే 27: జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం ప్రజలకు వరమని దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండల డ్రోన్ సర్వేను 28వ వార్డులో శుక్రవారం ఆయన ప్రారంభించారు. ముందుగా వార్డులో పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జాయింట్ కలెక్టర్ జేవీ మురళి మాట్లాడుతూ సర్వే నెంబర్ భూమికి పేరు లాంటిదని, డ్రోన్ ద్వారా సర్వే ప్రజలకు మేలు చేస్తుందన్నారు. కమిషనర్ బాలస్వామి, ఎంపీడీవో మల్లికార్జున రావు, తహసీల్దార్ అప్పారావు, డీఈ శ్రీనివాస్ బాబు, కర్రి భాస్కరరావు, సొసైటీ చైర్మన్ తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు.