రోడ్డు, డ్రెయినేజీ సమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-06-28T05:11:55+05:30 IST
రోడ్లు, డ్రెయినేజీ సమస్యలు పరిష్కరించాలని సీపీఎం మండల నాయకులు బొడ్డు లక్ష్మీపతి డిమాండ్ చేశారు.
భీమవరం రూరల్, జూన్ 27: రోడ్లు, డ్రెయినేజీ సమస్యలు పరిష్కరించాలని సీపీఎం మండల నాయకులు బొడ్డు లక్ష్మీపతి డిమాండ్ చేశారు. భీమవరం మం డలం రూరల్ తోకతిప్ప గ్రామంలో సోమవారం గ్రామ కార్యదర్శి కల్యాణికి సమస్యలతో కూడిన వినతిపత్రం ఇచ్చారు. సీపీఎం నాయకుడు బొడ్డు లక్ష్మీపతి మాట్లాడుతూ ఇంటింటికి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా రోడ్లు డ్రైనేజీ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఉపాధి హామీ పథకం పనులు వంద రోజులు కల్పించాలని వేతన బకాయిలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పొన్నాల నాని, బొమ్మిడి సాయి, బర్రి రమేష్, పొన్నాల రాజు, తిరుమాని పండు, తదితరులు పాల్గొన్నారు.