భవన నిర్మాణ కార్మికుల ధర్నా

ABN , First Publish Date - 2022-08-11T05:26:55+05:30 IST

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా కార్మికుల సంక్షేమ పథకాలకు చెల్లించాల్సిన క్లెయి మ్స్‌ తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్య క్షుడు కోనాల భీమారావు డిమాండ్‌ చేశారు.

భవన నిర్మాణ కార్మికుల ధర్నా
జేసీకి వినతిపత్రం ఇస్తున్న నేతలు

భీమవరం అర్బన్‌, ఆగస్టు 8: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా కార్మికుల సంక్షేమ పథకాలకు చెల్లించాల్సిన క్లెయి మ్స్‌ తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్య క్షుడు కోనాల భీమారావు డిమాండ్‌ చేశారు. ఏఐటీ యూసీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిం చారు. అనంతరం ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌ కృష్ణవేణికి వినతిపత్రం అం దించారు. భీమరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 వేల క్లెయిం లు చెల్లించాల్సి ఉందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. ఏఐటీయూసీ నాయకులు చెల్లబోయిన రంగారావు భవన నిర్మాణ కార్మిక సంఘం సభ్యులు పాల్గొన్నారు.


తాడేపల్లిగూడెం రూరల్‌: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరి ష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కార్మిక సంఘ నేతలు స్పష్టం చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్‌, ఎం.జేమ్స్‌, పడాల శ్రీనివాస్‌, ఏఐటీయూసీ ఏరియా కమిటీ కార్యదర్శి ఓసూరి వీర్రాజు తదితరులు మాట్లాడారు.

Updated Date - 2022-08-11T05:26:55+05:30 IST