AP News: భీమవరంలో భారీ చోరీ
ABN , First Publish Date - 2022-08-30T14:49:39+05:30 IST
భీమవరం టూటౌన్లో భారీ చోరీ జరిగింది.
పశ్చిమగోదావరి: భీమవరం టూటౌన్లో భారీ చోరీ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున పుప్పాల చిన్న సూర్యచంద్రరావు అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. దాదాపు 8 లక్షల నగదు, 60 కాసుల బంగారం చోరీకి గురైనట్లు సమాచారం. పుప్పాల చిన్న సూర్యచంద్రరావు దంపతులకు మెలుకువ రాకుండా చేసి దొంగతనం చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబుకు చిన్న సూర్యనారాయణ అతి దగ్గర బంధువు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.