పారిశుధ్య కార్మికుల ధర్నా

ABN , First Publish Date - 2022-08-17T05:19:52+05:30 IST

నగర పాలక సంస్థలోని పారిశుధ్య కార్మికులు, స్కూల్‌ స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమయ్య డిమాండ్‌ చేశా రు.

పారిశుధ్య కార్మికుల ధర్నా

ఏలూరుటూటౌన్‌, ఆగస్టు 16: నగర పాలక సంస్థలోని పారిశుధ్య కార్మికులు, స్కూల్‌ స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమయ్య డిమాండ్‌ చేశా రు. నరగపాలక సంస్థ కార్యాలయం వద్ద మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ కార్మికులకు ఏడు హెల్త్‌ అలవెన్సులు ఇవ్వాలని, 10వ పీఆర్‌సీ ఎరియర్స్‌ రూ.64లక్షలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విలీనగ్రామ పంచాయతీల కార్మికులకు మూడు నెలల బకాయిల జీతాలు, నాలుగు నెలల హెల్త్‌ అలవెన్సులు ఇవ్వాల ని డిమాండ్‌ చేశారు. అనంతరం డిప్యూటీ కమిషనర్‌ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. 


Updated Date - 2022-08-17T05:19:52+05:30 IST