బీసీలకు చేసిందేమిటి?

ABN , First Publish Date - 2022-12-07T00:17:24+05:30 IST

వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేసిందేమిటి? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు.

 బీసీలకు చేసిందేమిటి?
కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలియజేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు

వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేసిందేమిటి? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ‘ఇదేం ఖర్మ బీసీలకు’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సర్కారు తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ పాలనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. నిధులు, కుర్చీలు లేని పదవులు ఇచ్చి వెనుకబడిన తరగతి వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చినట్లు గుర్తు చేశారు. ప్రజలు అన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి, చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి , మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు తోయక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- పార్వతీపురం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి)

Updated Date - 2022-12-07T00:17:25+05:30 IST